1, డిసెంబర్ 2013, ఆదివారం

అలరాస పుట్టిళ్ళు

అలరాస పుట్టిళ్ళు పుస్తకం చదివా మరోసారి. కళ్యాణ సుందరీ జగన్నాథ్ సృజనకు నమోవాకాలు చెప్పాలి.

వొకనాటి పల్లెల వాతావరణాన్ని దర్శింప జెసారు.

కథ రాయడం లో ఆమె నేర్పరితనం అబ్బురపరుస్తుంది.

కథ లో ఉండాల్సిన సౌందర్యం ఏమిటో ఆమెకు తెలుసు.

చెప్పడం లో వొక అందం ఉండాలి. సొగసుదనం ఉట్టి పడాలి.

ఈ సంగతి తెలిసిన రచయిత్రి కళ్యాణ సుందరి జగన్నాధ్.

మన ప్రాంతం మన కథ లో కనిపించాలి. ఇది ఈమె కథల్లో చూస్తాం.

మరల మరల చదవాల్సిన పుస్తకమిది

22, నవంబర్ 2013, శుక్రవారం

చదవడం వొక కళ

చదవడం వొక కళ. శిశు హృదయం తో చదవాలి.  ఎన్ని పుస్తకాలు చదివినా వొక కొత్త పుస్తకం పటుకున్నపుడు కొత్తగా మొదలు పెట్టాలి.

కొందరు చదవకుండానే అంత తెలిసినట్టు మాట్లాడుతారు. చదవకుండానే ఆ పుస్తకాన్ని గురించి తీర్పులు ఇస్తుంటారు..

ఆ మధ్యన వొక పెద్ద రచయితను ఝుంప లాహిరి నవల ది లో ల్యాండ్ చదివారా అని అడిగా.

విదేశాల్లో ఉండే భారతీయ రచయితలంతా హంబగ్ అని తేల్చి వేసాడు. వారు రాసే దాన్నిలో ఏమి ఉండదన్నాడు. చాల తేలికగా మాట్లాడాడు. ఎవరి సంగతి ఏమో గాని ఝుంప లాహిరి కొట్టి పడేయదగ్గ రచయిత్రి కాదు.

ఆమె రచనలు  సీరియస్ గా, సిన్సియర్ గా ఉంటాయి. aesthetic beautry ఉన్న రచనలు చేసారు ఆవిడ.

కాని సదరు రచియత ఏమి చదవకుండానే ఆమె గురించి తేలికగా మాట్లాడాడు.

అందుకే చదవడం వొక కళ. లోలోపల తపన ఉండాలే తప్ప బలవవంతం గా
ఎవరూ చదివించలెరు.

మనసు పెట్టి చదవాలి. అప్పుడే చదువు లో ఆనందం తెలుస్తుంది. చదవడం హృదయానికి ఎలాంటి వెలుగుని ఇస్తుందో అనుభవం లోకి వస్తుంది.

చదవడం కూడా వొక కళ అని పెద్దలు చెప్పారు.

ఆ కళలో ఆరితేరిన వారు చదువు లోని ఆనందం అనుభవిస్తారు.


9, నవంబర్ 2013, శనివారం

హాయిగా ఉండటం ఎలానో చెప్పిన జలంధర కథలు

మనకు నచ్చిన పుస్తకం అయితే ఎన్ని సార్లయినా చదువుతాం

నచ్చిన పాటని పదేపదే విన్నట్టు 

నచ్చిన కవితని మరల మరల చదివినట్టు నచ్చిన కథని, నచ్చిన నవలని చదువుతూనే ఉంటాము. 

వొక పువ్వు పూసింది కథని ఎన్ని సార్లు చదివామో కదా. 

జీవాతాదర్శము ఎన్నిసార్లు చదివమొ. 

దేశికా చారి  బాగా నచ్చాడు 

లాలస పేరులోనే తెలియని వలపు ఉన్నది. 

ఏదో మహత్తు ఉంది. 

వొక పువ్వుని చూస్తూ యుగాలు గడపొచ్చు అన్నాడు వొకాయన. 

వొక పుస్తకం చదువుతూ హాయిగా గడపొచ్చు. 

అలా చదివే అలవాటు ఉన్నవారు యెవరున్నారు. 

ఎవరి సంగతి నాకు అక్కరలేదు. 

నాకు మాత్రం చదువులోనే గొప్ప రిలీఫ్ ఉన్నది 

చదువు లోనే హాయిదనం ఉంది. 

హాయిగా ఉండటం ఎలానో చెప్పిన జలంధర కథలు చదవండి. 

8, నవంబర్ 2013, శుక్రవారం

హృదయాన్ని తాకుతాడు తిలక్

ఏ రాత్రో ఏదైనా కవిత్వం చదవాలనిపిస్తే బైరాగి పుస్తకాన్ని చేతి లోకి తిసుకున్తను. 

లేదంటే అమృతం కురిసిన రాత్రి చదువుతాను. 

వజీర్ రహమాన్ 'ఎచటికి పోతావీ రాత్రి'ని ఇష్టంగా చేరుకుంటాను 

ఇస్మాయిల్ ని కూడా కొన్ని రాత్రుల్లొ పలకరిస్తాను. 

శ్రీ శ్రీ ని ఆలస్యంగా తెలుసుకున్న. 

అయినప్పటికీ మరల మరల చదివా 

నిజానికి తిలక్ నే ఎక్కువ సార్లు చదివా 

శ్రీ శ్రీ బుద్ధిని తాకితే, తిలక్ హృదయాన్ని తాకుతాడు. 

లొలొఅపలికి చూసుకోవడానికి తిలక్, బైరాగి లు దారి చూపుతారు. 

కవిత్వాన్ని ప్రేమించడం తిలక్ నేర్పాడు 

శివసాగర్ వొక వయసు లో ఉగించి శాసించాడు 

కవిత్వం లో సౌందర్యాన్ని చూడటం నేర్పిన కవి శివ సాగర్ 

ఆయన కవిత్వాన్ని పారాయణం చేసిన రోజులున్నై. 

6, నవంబర్ 2013, బుధవారం

పున్నాగపూలు నవల లో ఈరోజు మరి కొన్ని పేజెస్ చదివాను. 

బుచ్చిబాబు గారి నవల చివరకు మిగిలేది తరవాత మరల మరల చదవాలనిపించే నవల ఇది అనిపిస్తుంది. 

చలం జీవితాదర్శం నవలని చాల సార్లు చదివా. 

మైదానం తో పటు చలం జీవితాదర్శం చదివితేనే చలం ఏమిటో, ఏమి చెప్పాడో తెలుస్తుంది 

ఈతరానికి ఏం కావాలో తెలిసిన క్రియేటివ్ రైటర్ జలంధర గారు. 

ఆమె కథలు, ఆ కథల్లోని కొన్ని పాత్రలు నాకు బాగా గుర్తు 

వియద్గంగ కథ ని మరల మరల చదవాలి. 

ఆలాగే పూర్ణిమ కథ కూడా. 

హాయిగా ఉండడం ఎలాగో నాకు తెలుసు అని వొక స్త్రీ పాత్ర చెప్పడం లో ఎంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. 

జలంధర గారి కథల్లో గాని, నవల లో గాని ఫిర్యాదులు లేవు. 

ఆలోచించడం నేర్పాలి అనే మాట ఈ నవల లో నాకు బాగా నచ్చింది. 

నిజమే, మన చుట్టూ ఉండే వాళ్ళలో చాల మందికి ఆలోచించడం ఎలానో నేర్పాలి. 

సాహిత్యం మీద ప్రేమ, ఇష్టం ఉన్నవాళ్లు వొక సారి జలంధర గారి కథలు చదవండి 

పున్నాగ పూలు నవల తప్పనిసరిగా చదవాలి 

నవల ని ప్రమోట్ చేస్తున్నట్టు గా అనిపిస్తుందేమో ఈ మాట. 

కావచ్చు,  తెలియని వాళ్లకు తెలియ జెప్పడం తప్పు కాదు. అంతే గాక వొక మంచి పుస్తకం గురించి యెంత చెప్పినా, ఎన్ని సార్లు చెప్పినా నష్టం లెదు. 

ఇలా చెప్పడం ప్రేమతో, ఇష్టంతో చేసే పని. 
ఇదివరకు వొక మంచి పుస్తకం గురించి మిత్రులకు ఉత్తరాల్లో రాసేవాళ్ళం. 

ఇదీ  ఆలాంటి ఉత్తరమే. 
జలంధర గారి సృజనాత్మక శైలి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా. 

4, నవంబర్ 2013, సోమవారం

ఈ మధ్యన జలంధర గారి నవల 'పూన్నాగ పూలు' చదివా.

400 పేజి ల నవల చదివించింది

రచయిత్రి ఊహా శక్తి కి జోహార్లు చెప్పాలి

రాధ పాత్ర ని తీర్చి దిద్దిన తీరు అపురూపం.

విశ్లేషణ సులువు కాదు.

చదవాలి. చదివి ఆ పారవశ్యం లో తేలియాడాలి.

వొక సుదీర్ఘమైన నవల రాయాడానికి చాల సమయం పడుతుంది.

పాత్రల నడుమ, సంఘటనల నడుమ అంతర్గత సంబంధం కొనసాగించాలి

దీనికి ఎంతో కసరత్తు చేయాలి

చివరకు నవల తనకు నచ్చాలి

రీడర్స్ కు నచ్చాలి

400 పేజిల చదివించాలంటే అంత ఉద్విగ్న భరిత కొనసాగింపు కావాలి.

ఈరకంగా రచయిత్రి కోణం లో నుంచి చూసినప్పుడు నవల రాయడం వెనుక జలంధర గారి శ్రమ చిన్నదేం కాదు

ఈ నవల ని 3 రోజుల్లో చదివా

ఎక్కడ ఆపాలనిపించలేదు

వొక్కొక్క పాత్ర ని రూపొన్దీంచిన తీరు విస్మయం గొల్పింది

జలంధర తాత్త్విక భావ ధార ఈ నవల లో మరింత స్పష్టంగా అభివ్యక్తమైంది

ఆమె ికథలు చదివి ఉంటే ఈ నవల ద్వారా జలంధర గారి ఆలోచనా ధార ఇంకా స్పష్టం గా అర్ధమవుతుంది

తమకు ఏమి కావాలో తెలియక చాల మంది నానా గందరగోళం లో పడి బ్రతుకు వృధా చేసుకుంటారు.

కాని జీవితం వోక్కసారే వొస్తుంది
దానిని ఎలా మలుచుకోవాలో చెప్పకనే చెబుతుంది ఈ నవల.

24, అక్టోబర్ 2013, గురువారం

తెలుగు వాక్యానికి కొత్త 'సోయగం

వొక మంచి  తెలుగు వాక్యం కోసం రాజిరెడ్డి పుస్తకం చదవాలి.

జర్నలిస్ట్లు గా  ఎక్కువ కాలం ఉంటె సృజనాత్మకత దెబ్బ తింటుందని గతంలో అనేవాళ్ళు.

అది నిజం కాదని మాధవ్, రాజిరెడ్డి ప్రూవ్ చేశారు.

మాధవ్ పుస్తకం ఆభౌతిక స్వరం చదవండి.

రాత్రి వేళ ఏకాంతంలో తన వాక్యం చదవడం ఎంతో ఆహ్లాదకర అనుభవం.

వాక్యాలకు తెలియని పరిమళం ఉంటుంది.

ఆ పరిమళానికి మనమే ఏదైనా పేరు పెట్టాలి.

లోలోపల వొక మధుర భావన సుడులు తిరుగుతుంది.

మనకు తెల్సినట్టే ఉండి తెలియని వారి గురించి రాసిన పధ్ధతి లోని కొత్తదనం చూసి పడిపోతాం.

ఇలా కూడా రాయవచ్చునా అనుకుంటారు.

ఇలా రాయడం వల్లనే రీడర్స్ దగ్గరికి చేరుకోగలం.

ఫీచర్ రైటింగ్ ఎలా ఉండాలో మాధవ్ తో కొత్త వారికి, కొంత మంది పాత వారికి కూడా క్లాసు ఇప్పించాలి.

చాల మందికి తెలియదు కాని మాధవ్ కథలు రాసాడు.

మన కాలానికి అవసరమైన రచయిత మాధవ్.
...

రాజిరెడ్డి పుస్తకం పలక పెన్సిల్ నాకు బాగా నచ్చింది

నేను చెప్పాలనుకునే విషయాలని నా కన్నా బాగా చెప్పాడు

నా మనసులో ఉండే విషయాలని... నాలో నేను తర్కించిన సంగతులు ఎన్నో రాజిరెడ్డి చెప్పాడు

చాన్నాళ్ళ కిందట జి. కృష్ణ గారు వొకసారి క్లాసు లో చెప్పారు- మామూలు విషయాల మీద రాయడం లోనే అసలు సిసలు ప్రతిభ ఉన్నదని.

అవీ ఇవీ అని చాలా సాదా సీదా సంగతుల గురించి ఆయన రాసారు. చదువుతుంటే ఎంతో థ్రిల్.

సీరియస్ గా రాయాలి అని గంభీరం గా మొదలు పెట్టి ఎక్కడో తప్పి పోయే కాలమిస్ట్ లని చూస్తుంటాం.

కాని మొదలు పెట్టడమే మనతో ముచ్చట పెట్టినట్టు ఎత్తుకోవడం రాజిరెడ్డి చేసాడు.

మామూలు గా చెప్పే ముచ్చట్ల తోనే మన మనసుకు హత్తుకునేట్టు చెప్పడం వొక కళ.

ఇలా చెప్పిన మాటలే మరేదో సందర్భం లో రాజిరెడ్డి అప్పుడే చెప్పాడు కదా అనుకుంటాము.

ప్రేమ గురించి భలే రాసాడు రాజిరెడ్డి. చలం చెప్పాక ఇంకా ప్రేమ గురించి చెప్పాడానికి ఏం ఉంటుందనుకోవద్దు.

చెప్పడానికి, మనసును మరింత బాగా హత్తు కోవడానికి ఛాన్స్ ఉంది.

మన వెలుగు వెన్నెల ఆమే అని బాగా చెప్పాడు. ఈ వ్యాసం చివరి రెండు లైన్లు మనసైన ఆమ్మాయితో చెబితే యెంత ముచ్చట పడుతుందో కదా.

ఇంతకీ ఏమిటా  రెండు లైన్లు అని అడగదలుచుకున్నారా.

పలక పెన్సిల్ చదవండి. మీకే తెలుస్తుంది.

ఆ రెండు వాక్యాల కోసం పుస్తకం తీసుకోవాలి. చదవాలి. చదివి  పరవశించి పోవాలి.

అందుకే రాజిరెడ్డి కేవలం పత్రికా  రచయిత కాదుhe  is  creative  writer

23, అక్టోబర్ 2013, బుధవారం

నిత్య గాయాల నది

తెలుగు కథా సాహిత్యం లో కొందరు అరుదుగా మంచి కథలు రాస్తారు. వారి లో చెప్పుకోదగిన రచయిత బెజ్జ్జా రపు రవీందర్. ఆ కథల పుస్తకం ఇప్పుడు విదుదలయిన్ది.  

మరోసారి చదివాను. 

కథ లో ఉండవలసిన సౌందర్యం ఏమిటో రవీందర్ కి తెలుసు. 

వస్తువు ని కళాత్మకం గా మలచడం ఎలాగో అతనికి తెలుసు. 

కథ అంటే ఎలా ఉండాలో తెలుసు. 

ఇతని కథ చదవడం మన కాలం వృధా చేసుకోవడం కాదు. 

ట్రూ యువర్ సెల్ఫ్ అని కొందరు రచయితలు చెబుతుంటారు. 

తను ఏమిటో రవీందర్ కి తెలుసు. 

వొక ఉద్విగ్నత కు లోను చేయగల కథనం ఇతని కథల్లో ఇమిడి ఉన్నది. 

తెలంగాణా నుంచి వచ్చిన అరుదైన రచయిత రవీందర్. ప్రచార ఆర్భాటం లేని రచయిత. ఐడెంటిటీ క్రైసిస్ లేదు అతనికి. 

తన కన్నా తన కథలు జనం లోకి వెళ్ళాలని భావించే రచయిత  రవీందర్. 

చరణం జారి పోయాక కథ చదవండి. రియాలిటీ ని చెప్పడం ఏలనో తెలుస్తుంది. కథ చదివాక మనలో ఆలజడి చెలరేగాలి. తెలియకనే ఆలోచనల్లోకి జారిపోవాలి. పాత్రల కదలికలు మనలో వొక చలనం తీసుకు రావాలి. 

నిత్య గాయాల నది పుస్తకం పేరు. ఇదే పేరుతొ వొక కథ ఉన్నది. తెలంగాణా సంవేదనను ఏంటో ఆర్ద్రం గా చెబుతారు. 

రచయితా ఊహాశాలిత అబ్బురపరుస్తుంది. 

చాల కాలానికి తెలంగాణా కు చెందిన వొక మంచి కథల పుస్తకం చదివిన అనుభూతి. 
నినాదం కథ కాదు. 

పాత్రలకు ఉద్వేగాలు ఉండవచ్చు కాని రచయిత కు ఉండ కూడదు. ఈ సంగతి రవీందర్ కి తెలుసు. 

అందుకే అతని కథల్లో ఉండే వొరవడి మనలకి  ప్రత్యేక ఆకర్షణ. 

కవిత్వం లానే రవీందర్ కథలు మరోసారి మరోసారి చదువుకోవచ్చు. 

యాంగ్ మో రాసిన ఉద‌య‌గీతిక నాకు అత్యంత ఇష్ట‌మైన న‌వ‌ల‌. క్యాంప‌స్‌లో ఏ హాస్ట‌ల్‌లో ఉండ‌గా దొరికిన న‌వ‌ల ఇది. న‌వ‌ల చేతికొచ్చి చ‌ద‌వ‌డం మొద‌ల...