4, నవంబర్ 2013, సోమవారం

ఈ మధ్యన జలంధర గారి నవల 'పూన్నాగ పూలు' చదివా.

400 పేజి ల నవల చదివించింది

రచయిత్రి ఊహా శక్తి కి జోహార్లు చెప్పాలి

రాధ పాత్ర ని తీర్చి దిద్దిన తీరు అపురూపం.

విశ్లేషణ సులువు కాదు.

చదవాలి. చదివి ఆ పారవశ్యం లో తేలియాడాలి.

వొక సుదీర్ఘమైన నవల రాయాడానికి చాల సమయం పడుతుంది.

పాత్రల నడుమ, సంఘటనల నడుమ అంతర్గత సంబంధం కొనసాగించాలి

దీనికి ఎంతో కసరత్తు చేయాలి

చివరకు నవల తనకు నచ్చాలి

రీడర్స్ కు నచ్చాలి

400 పేజిల చదివించాలంటే అంత ఉద్విగ్న భరిత కొనసాగింపు కావాలి.

ఈరకంగా రచయిత్రి కోణం లో నుంచి చూసినప్పుడు నవల రాయడం వెనుక జలంధర గారి శ్రమ చిన్నదేం కాదు

ఈ నవల ని 3 రోజుల్లో చదివా

ఎక్కడ ఆపాలనిపించలేదు

వొక్కొక్క పాత్ర ని రూపొన్దీంచిన తీరు విస్మయం గొల్పింది

జలంధర తాత్త్విక భావ ధార ఈ నవల లో మరింత స్పష్టంగా అభివ్యక్తమైంది

ఆమె ికథలు చదివి ఉంటే ఈ నవల ద్వారా జలంధర గారి ఆలోచనా ధార ఇంకా స్పష్టం గా అర్ధమవుతుంది

తమకు ఏమి కావాలో తెలియక చాల మంది నానా గందరగోళం లో పడి బ్రతుకు వృధా చేసుకుంటారు.

కాని జీవితం వోక్కసారే వొస్తుంది
దానిని ఎలా మలుచుకోవాలో చెప్పకనే చెబుతుంది ఈ నవల.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

యాంగ్ మో రాసిన ఉద‌య‌గీతిక నాకు అత్యంత ఇష్ట‌మైన న‌వ‌ల‌. క్యాంప‌స్‌లో ఏ హాస్ట‌ల్‌లో ఉండ‌గా దొరికిన న‌వ‌ల ఇది. న‌వ‌ల చేతికొచ్చి చ‌ద‌వ‌డం మొద‌ల...