24, అక్టోబర్ 2013, గురువారం

తెలుగు వాక్యానికి కొత్త 'సోయగం

వొక మంచి  తెలుగు వాక్యం కోసం రాజిరెడ్డి పుస్తకం చదవాలి.

జర్నలిస్ట్లు గా  ఎక్కువ కాలం ఉంటె సృజనాత్మకత దెబ్బ తింటుందని గతంలో అనేవాళ్ళు.

అది నిజం కాదని మాధవ్, రాజిరెడ్డి ప్రూవ్ చేశారు.

మాధవ్ పుస్తకం ఆభౌతిక స్వరం చదవండి.

రాత్రి వేళ ఏకాంతంలో తన వాక్యం చదవడం ఎంతో ఆహ్లాదకర అనుభవం.

వాక్యాలకు తెలియని పరిమళం ఉంటుంది.

ఆ పరిమళానికి మనమే ఏదైనా పేరు పెట్టాలి.

లోలోపల వొక మధుర భావన సుడులు తిరుగుతుంది.

మనకు తెల్సినట్టే ఉండి తెలియని వారి గురించి రాసిన పధ్ధతి లోని కొత్తదనం చూసి పడిపోతాం.

ఇలా కూడా రాయవచ్చునా అనుకుంటారు.

ఇలా రాయడం వల్లనే రీడర్స్ దగ్గరికి చేరుకోగలం.

ఫీచర్ రైటింగ్ ఎలా ఉండాలో మాధవ్ తో కొత్త వారికి, కొంత మంది పాత వారికి కూడా క్లాసు ఇప్పించాలి.

చాల మందికి తెలియదు కాని మాధవ్ కథలు రాసాడు.

మన కాలానికి అవసరమైన రచయిత మాధవ్.
...

రాజిరెడ్డి పుస్తకం పలక పెన్సిల్ నాకు బాగా నచ్చింది

నేను చెప్పాలనుకునే విషయాలని నా కన్నా బాగా చెప్పాడు

నా మనసులో ఉండే విషయాలని... నాలో నేను తర్కించిన సంగతులు ఎన్నో రాజిరెడ్డి చెప్పాడు

చాన్నాళ్ళ కిందట జి. కృష్ణ గారు వొకసారి క్లాసు లో చెప్పారు- మామూలు విషయాల మీద రాయడం లోనే అసలు సిసలు ప్రతిభ ఉన్నదని.

అవీ ఇవీ అని చాలా సాదా సీదా సంగతుల గురించి ఆయన రాసారు. చదువుతుంటే ఎంతో థ్రిల్.

సీరియస్ గా రాయాలి అని గంభీరం గా మొదలు పెట్టి ఎక్కడో తప్పి పోయే కాలమిస్ట్ లని చూస్తుంటాం.

కాని మొదలు పెట్టడమే మనతో ముచ్చట పెట్టినట్టు ఎత్తుకోవడం రాజిరెడ్డి చేసాడు.

మామూలు గా చెప్పే ముచ్చట్ల తోనే మన మనసుకు హత్తుకునేట్టు చెప్పడం వొక కళ.

ఇలా చెప్పిన మాటలే మరేదో సందర్భం లో రాజిరెడ్డి అప్పుడే చెప్పాడు కదా అనుకుంటాము.

ప్రేమ గురించి భలే రాసాడు రాజిరెడ్డి. చలం చెప్పాక ఇంకా ప్రేమ గురించి చెప్పాడానికి ఏం ఉంటుందనుకోవద్దు.

చెప్పడానికి, మనసును మరింత బాగా హత్తు కోవడానికి ఛాన్స్ ఉంది.

మన వెలుగు వెన్నెల ఆమే అని బాగా చెప్పాడు. ఈ వ్యాసం చివరి రెండు లైన్లు మనసైన ఆమ్మాయితో చెబితే యెంత ముచ్చట పడుతుందో కదా.

ఇంతకీ ఏమిటా  రెండు లైన్లు అని అడగదలుచుకున్నారా.

పలక పెన్సిల్ చదవండి. మీకే తెలుస్తుంది.

ఆ రెండు వాక్యాల కోసం పుస్తకం తీసుకోవాలి. చదవాలి. చదివి  పరవశించి పోవాలి.

అందుకే రాజిరెడ్డి కేవలం పత్రికా  రచయిత కాదుhe  is  creative  writer

23, అక్టోబర్ 2013, బుధవారం

నిత్య గాయాల నది

తెలుగు కథా సాహిత్యం లో కొందరు అరుదుగా మంచి కథలు రాస్తారు. వారి లో చెప్పుకోదగిన రచయిత బెజ్జ్జా రపు రవీందర్. ఆ కథల పుస్తకం ఇప్పుడు విదుదలయిన్ది.  

మరోసారి చదివాను. 

కథ లో ఉండవలసిన సౌందర్యం ఏమిటో రవీందర్ కి తెలుసు. 

వస్తువు ని కళాత్మకం గా మలచడం ఎలాగో అతనికి తెలుసు. 

కథ అంటే ఎలా ఉండాలో తెలుసు. 

ఇతని కథ చదవడం మన కాలం వృధా చేసుకోవడం కాదు. 

ట్రూ యువర్ సెల్ఫ్ అని కొందరు రచయితలు చెబుతుంటారు. 

తను ఏమిటో రవీందర్ కి తెలుసు. 

వొక ఉద్విగ్నత కు లోను చేయగల కథనం ఇతని కథల్లో ఇమిడి ఉన్నది. 

తెలంగాణా నుంచి వచ్చిన అరుదైన రచయిత రవీందర్. ప్రచార ఆర్భాటం లేని రచయిత. ఐడెంటిటీ క్రైసిస్ లేదు అతనికి. 

తన కన్నా తన కథలు జనం లోకి వెళ్ళాలని భావించే రచయిత  రవీందర్. 

చరణం జారి పోయాక కథ చదవండి. రియాలిటీ ని చెప్పడం ఏలనో తెలుస్తుంది. కథ చదివాక మనలో ఆలజడి చెలరేగాలి. తెలియకనే ఆలోచనల్లోకి జారిపోవాలి. పాత్రల కదలికలు మనలో వొక చలనం తీసుకు రావాలి. 

నిత్య గాయాల నది పుస్తకం పేరు. ఇదే పేరుతొ వొక కథ ఉన్నది. తెలంగాణా సంవేదనను ఏంటో ఆర్ద్రం గా చెబుతారు. 

రచయితా ఊహాశాలిత అబ్బురపరుస్తుంది. 

చాల కాలానికి తెలంగాణా కు చెందిన వొక మంచి కథల పుస్తకం చదివిన అనుభూతి. 
నినాదం కథ కాదు. 

పాత్రలకు ఉద్వేగాలు ఉండవచ్చు కాని రచయిత కు ఉండ కూడదు. ఈ సంగతి రవీందర్ కి తెలుసు. 

అందుకే అతని కథల్లో ఉండే వొరవడి మనలకి  ప్రత్యేక ఆకర్షణ. 

కవిత్వం లానే రవీందర్ కథలు మరోసారి మరోసారి చదువుకోవచ్చు. 

యాంగ్ మో రాసిన ఉద‌య‌గీతిక నాకు అత్యంత ఇష్ట‌మైన న‌వ‌ల‌. క్యాంప‌స్‌లో ఏ హాస్ట‌ల్‌లో ఉండ‌గా దొరికిన న‌వ‌ల ఇది. న‌వ‌ల చేతికొచ్చి చ‌ద‌వ‌డం మొద‌ల...