26, జనవరి 2018, శుక్రవారం

అలరాస పుట్టిళ్ళు క‌థ‌ల‌ పుస్తకం మ‌ర‌ల మ‌ర‌ల చ‌ద‌వాల్సిన పుస్త‌కం. ర‌చ‌యిత్రి కళ్యాణ సుందరీ జగన్నాథ్ సృజనకు నమోవాకాలు చెప్పాలి.
వొకనాటి పల్లెల వాతావరణాన్ని దర్శింప జెసారు.
కథ రాయడం లో ఆమె నేర్పరితనం అబ్బురపరుస్తుంది.
కథ లో ఉండాల్సిన సౌందర్యం ఏమిటో ఆమెకు తెలుసు.
చెప్పడం లో వొక అందం ఉండాలి. సొగసుదనం ఉట్టి పడాలి.
ఈ సంగతి తెలిసిన రచయిత్రి కళ్యాణ సుందరి జగన్నాధ్.
పాఠ‌కుని స‌మ‌యాన్ని వృధా చేయ‌ని మేలిమి క‌థ‌ల సంపుటి అల‌రాస పుట్టిళ్ళు. 

యాంగ్ మో రాసిన ఉద‌య‌గీతిక నాకు అత్యంత ఇష్ట‌మైన న‌వ‌ల‌. క్యాంప‌స్‌లో ఏ హాస్ట‌ల్‌లో ఉండ‌గా దొరికిన న‌వ‌ల ఇది. న‌వ‌ల చేతికొచ్చి చ‌ద‌వ‌డం మొద‌ల...