23, అక్టోబర్ 2013, బుధవారం

నిత్య గాయాల నది

తెలుగు కథా సాహిత్యం లో కొందరు అరుదుగా మంచి కథలు రాస్తారు. వారి లో చెప్పుకోదగిన రచయిత బెజ్జ్జా రపు రవీందర్. ఆ కథల పుస్తకం ఇప్పుడు విదుదలయిన్ది.  

మరోసారి చదివాను. 

కథ లో ఉండవలసిన సౌందర్యం ఏమిటో రవీందర్ కి తెలుసు. 

వస్తువు ని కళాత్మకం గా మలచడం ఎలాగో అతనికి తెలుసు. 

కథ అంటే ఎలా ఉండాలో తెలుసు. 

ఇతని కథ చదవడం మన కాలం వృధా చేసుకోవడం కాదు. 

ట్రూ యువర్ సెల్ఫ్ అని కొందరు రచయితలు చెబుతుంటారు. 

తను ఏమిటో రవీందర్ కి తెలుసు. 

వొక ఉద్విగ్నత కు లోను చేయగల కథనం ఇతని కథల్లో ఇమిడి ఉన్నది. 

తెలంగాణా నుంచి వచ్చిన అరుదైన రచయిత రవీందర్. ప్రచార ఆర్భాటం లేని రచయిత. ఐడెంటిటీ క్రైసిస్ లేదు అతనికి. 

తన కన్నా తన కథలు జనం లోకి వెళ్ళాలని భావించే రచయిత  రవీందర్. 

చరణం జారి పోయాక కథ చదవండి. రియాలిటీ ని చెప్పడం ఏలనో తెలుస్తుంది. కథ చదివాక మనలో ఆలజడి చెలరేగాలి. తెలియకనే ఆలోచనల్లోకి జారిపోవాలి. పాత్రల కదలికలు మనలో వొక చలనం తీసుకు రావాలి. 

నిత్య గాయాల నది పుస్తకం పేరు. ఇదే పేరుతొ వొక కథ ఉన్నది. తెలంగాణా సంవేదనను ఏంటో ఆర్ద్రం గా చెబుతారు. 

రచయితా ఊహాశాలిత అబ్బురపరుస్తుంది. 

చాల కాలానికి తెలంగాణా కు చెందిన వొక మంచి కథల పుస్తకం చదివిన అనుభూతి. 
నినాదం కథ కాదు. 

పాత్రలకు ఉద్వేగాలు ఉండవచ్చు కాని రచయిత కు ఉండ కూడదు. ఈ సంగతి రవీందర్ కి తెలుసు. 

అందుకే అతని కథల్లో ఉండే వొరవడి మనలకి  ప్రత్యేక ఆకర్షణ. 

కవిత్వం లానే రవీందర్ కథలు మరోసారి మరోసారి చదువుకోవచ్చు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

యాంగ్ మో రాసిన ఉద‌య‌గీతిక నాకు అత్యంత ఇష్ట‌మైన న‌వ‌ల‌. క్యాంప‌స్‌లో ఏ హాస్ట‌ల్‌లో ఉండ‌గా దొరికిన న‌వ‌ల ఇది. న‌వ‌ల చేతికొచ్చి చ‌ద‌వ‌డం మొద‌ల...