15, జులై 2017, శనివారం

'మధుమానసం'లో అందమైన వచనం 

కొందరి ప్రతిభ లలిత లలిత మైంది.       సున్నితమైన  వ్యక్తీకరణలతో  తమ మానసిక ప్రపంచాన్ని అతి సుందరంగా, లలితంగా వ్యక్తీకరిస్తారు. ఈ కోవకు   చెందిన కవయిత్రి మానస చామర్తి. ఈ ఏడాది - 2015- ఇస్మాయిల్‌ పురస్కారాన్ని ఆమెకు అందజేయనున్నట్టు యదుకుల భూషణ్‌    ఒక ప్రకటనలో తెలియజేశారు. మానస కవిత్వ పుస్తకం రాలేదు. బ్లాగులో ఆమె కవిత్వం వుంది. ఆ కవిత్వాన్నే కాదు, ఆమె వచనాన్ని చదివినా పాఠకులు ముగ్ధులవుతారు. అందుకే ప్రత్యేకించి ఆమె కవిత్వం కన్నా బ్లాగు గురించి సంక్షిప్త పరిచయం పాఠకులకు ప్రత్యేకం. 

బ్లాగు రాయడం ఓ కళ. తమ అనుభవాలు, అనుభూతులు, అంతరంగాన్ని కదిపి కుదిపే ఘటనలు ఎన్నిటినో అక్షరాల్లో కూర్చి ఆవిష్కరించడం ఓ కళాసాధన. తమ భావనా పరంపరని అందంగా, ఆర్ద్రంగా, పఠిత మనసు మెచ్చేలా రాయడం ఓ సృజనాత్మక కౌశలం. అలాంటి కౌశలం, సృజనాత్మక ప్రతిభ మానస చామర్తి గారి 'మధుమానసం' బ్లాగులో దాగుంది. చదివిన కొద్దీ చదవాలనిపించే తియ్యందనాలు ఈ బ్లాగులో వున్నాయి. 

వైవిధ్యమైన ఉత్తమ అభిరుచులతో మిళితమైన ఆమె బ్లాగు చదవడమూ చక్కటి సృజనాత్మక అనుభవం. అక్షరాలకు సౌందర్యాన్ని సమకూర్చే ఇంద్రజాలమేదో ఆమెకు ఉంది. విభిన్న ప్రక్రియలతో కూడిన ఈ బ్లాగులోని కవిత్వమూ, వచనమూ పరమ ఆకర్షణీయం. 

అప్పుడప్పుడు రాసిన కవితలు, వ్యాసాలు, యాత్రాకథనాలు, పుస్తక పఠనానుభవాలు, అనేకానేక అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఈ బ్లాగుకు నిండుదనాన్ని సమకూర్చాయి. సంగీతం, పాటల మీద వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో ఓ మార్దవం వుంది. యాత్రాకథనాల్లో 'గోకర్ణం' గురించి రాసిన లలిత లలితమైన కథనం చదవడం మనసుని పరిమళింపజేసే అనుభవం. 'శివం సుందరం గోకర్ణం' శీర్షికన రాసిన ఈ కథనం నేరుగా పాఠకుణ్ణి గోకర్ణం తీసుకెళుతుంది. అక్షరాల్లోని రమ్యత, పదాల్లోని సొగసుదనం, వాక్యాల్లోని ఇంద్రజాలం ఈ వ్యాసానికి ఒక మహత్తును సమకూ ర్చాయి. బహుశా అది ఆ ప్రాంతానికి కూడా వుందేమో! ఈ వ్యాసం చదివాక గోకర్ణం ఎప్పుడు చూద్దామా అని మనసు కొట్టుకులా డుతుంది. 

కవుల కవిత్వాల్లో నందకిశోర్‌     కవిత్వ సంపుటి 'నీలాగే ఒకడుండేవాడు' మీద రాసిన వ్యాసం, అలాగే బుచ్చిబాబు 'చివరకు మిగిలేది', చలం 'పురూరవ'లపై విశ్లేషణలు బావున్నాయి. ఈ నవలలని కొత్తతరం పాఠకులకు చదవాలనే ఆసక్తిని కలిగిస్తాయి. వచనాన్ని అత్యంత సౌందర్యభరితంగా వాడుకున్న రచయితలు చలం, బుచ్చిబాబు.  వారి గురించి మానస వ్యక్తం చేసిన అభిప్రాయాలు సాహిత్యంలో సౌందర్యాన్ని చూసే ఆమె దృష్టికోణాన్ని తెలియజేస్తాయి. 

'అనుభవాలూ జ్ఞాపకాలూనూ' శీర్షికన చేసిన రచనలు కూడా వైవిధ్యంగా వున్నాయి. ఆమె ఊహాశాలితను తెలియజేస్తాయి. జ్ఞాపకాల్ని అభివ్యక్తం   చేయడంలో    వాక్యవిన్యాసమూ ఆకట్టుకుంటుంది. నిజం చెప్పాలంటే మానస గారి ప్రతి రచనలోనూ సౌందర్యాత్మకత ప్రతిఫలిస్తుంది. గుండె గొంతులో తారాట్లాడే భావాన్ని అందంగా చెప్పాడానికి ప్రయత్నించారు. బహుశా అందంగా చెప్పడం ఆమెకు అలవోకగా అబ్బిందనిపిస్తుంది ఈ బ్లాగును చదివితే. ఒక మంచి పుస్తకంలో నచ్చిన అధ్యాయాల్ని కొంచెం కొంచెం ఇష్టంగా చదివినట్టు ఈ 'మధుమానసం' బ్లాగును చదవాలి. బ్లాగు చిరునామా: 

http://www.madhumanasam.in. మానస చామర్తి గారి గురించిన వివరాల్ని ఫేస్‌బుక్‌లోనూ చూడొచ్చు. సృజనాత్మకంగా జీవించే తత్వమే ఆమె బ్లాగుకు మూలం.

10, మార్చి 2017, శుక్రవారం

కొండపల్లి కోటేశ్వరమ్మ గారి పుస్తకం చదివా. వారి అనుభావాల పరమ్పర బాగుంది.

రాసిన తీరు నచ్చింది.

కొన్ని కొత్త విషయాలున్నాయి.

ఒక మనిషి ప్రయాణం ఎన్ని విధాలుగా మలుపులు తిరిగే అవకాశం ఉన్నదో తెలుస్తుంది.
ఆ ప్రయాణమే ఆసక్తికరం. 
మరల మరల చదివించే కవిత్వమే నిజమైన కవిత్వమ్.

ఆలాంటి వొక పుస్తకం అమృతం కురిసిన రాత్రి. ఈ రాత్రి మరల వొకసారి చదివాను.

దేవరకొండ బాలగంగాధర తిలక్ 

19, మే 2014, సోమవారం

ఇప్పుడు తను వొంటరి

వొంటరితనం నుంచి దాస్ కాపిటల్ సేవ్ చేయదు

మాన్ ఇస్ సోషల్ అనిమల్ అన్నారు

మరి ఎందుకీ వొంటరితనం

ఎవరు చెప్పగలరు

ఆ మధ్యన 60 ఇయర్స్ కామ్రేడ్ వచ్చారు

వొంటరి గా ఉండాలంటే భయం గా ఉంటుందని చెప్పాడు

30 ఇయర్స్ వెనుక విప్లవాన్ని గురించి ఎంతో చెప్పేవాడు

ఇప్పుడు తను వొంటరి

సమాజం మారలేదు

విప్లవం రాలేదు

తోడూ గా ఉండే భార్య అమెరికా లో ఉంది

ఇల్లు ఉంది

ఇంట్లో డాలర్స్ ఉన్నాయ్

పలకరించే మనిషి లేదు

విప్లవాల మిత్రులు ఎవరూ రారు.

కలవరు

మాట్లాడరు

ఫోన్ చేయరు

వొక సమ సమాజం గురించి వందల గ్రామాలలో తిరిగి మాట్లాడిన మనిషి ఇప్పుడు
వొంటరి.

ఎంతటి విషాదం.

లైఫ్ ఇస్ బ్యూటిఫుల్

లైఫ్ ఇస్ misereable

వొంటరితనం వొక సమూహాన్ని కల గన్న కవికి రావడం ఏమిటి

కలలు చెదిరిన కాలం చెప్పిన పాఠం ఏమిటి

సొంత లాభం కొంత చూసుకు బతకవలేనోయి అని చెప్పకనే చెప్పడం కదా.

ప్లీజ్  థింక్ అబౌట్ ఇట్  

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

love 2020

కొన్ని సార్లు చిత్రమైన అనుభవాలు ఎదురువుతాయి.

ఈ రోజు వొక మిత్రుడు ఆఫీసుకు వచ్చాదు. 'సంవిధానం'లో ప్రతాప్ కథల గురించి రాసిన వ్యాసం తిరగేసాడు.

ప్రతాప్ కథ లవ్ 2020 గురించి  రాసిన కొన్ని వాక్యాలు తనకు నచ్చాయి.

ఆ కథ చదవాలని ఉంది. కావాలన్నాడు.

సరే, తరవాత ఇస్తానని చెప్పా.

 రచన మనకు తెలియకనే మనుషులను ఆలోచింప చేస్తుంది కదా అనిపించింది.

చాన్నాళ్ళ కిందట కాశీభట్ల రచనల గురించి రాసినప్పుడు కొంతమంది నుంచి ఈ రకమైన స్పందన చూసా.

మరల ఇప్పుడు ఆలాంటి స్పర్శ.

ప్రతాప్ రాసిన కొన్ని కథలు అప్పుడప్పుడు గుర్తు కొస్తాయి.

వాటి లో లవ్ 2020 వొకటి.

మనకు బావుందనిపించే రచనల గురించి పదిమందికి తెలియచెప్పడం ఉపయోగకరం

ఈ నడుమ జలంధర గారి నవల  గురించి రాసా.

కోటబుల్ కోట్స్ లాంటి మాటలు ఎన్నో ఉన్నాయి.

వాటిని వొక చోట చేర్చి పుస్తకం తీసుకు వచ్చినా బావుంటుంది.

  

3, ఫిబ్రవరి 2014, సోమవారం

చూడని బతుకు పొరలు

బయటి గుడిసెలు

దేవులపల్లి కృష్ణమూర్తి  రాసిన నవల బయటి గుడిసెలు.

మొదలు పెడితే ఆసాంతం చదివించింది. మన ఆలోచన స్రవంతి కి రాని మనుషుల జీవితాలను సృజించారు.

అయినప్పటికీ మనచే చదివింప చేస్తుంది. జీవితపు మరో పారశ్వాన్ని చూపిస్తారు రచియత.

మన తో నిమిత్తం లేకుండా నవల లోని పత్రాల వెంటే నడిచి వెలతము.

అప్పటివరకు చూడని బతుకు పొరలు చూస్తాము.

ఇందుకోసమే ఈ నవల చదవాలి.

సమాజాన్ని ధిక్కరిస్థున్నామని తెలియకుండానే ఆ పని చేస్తున్న వారి బతుకులు ఎలా ఉన్నాయో, వారి జీవితం లో వారు ఏమి కోరుకుంటున్నారో ఈ నవల చదివితే తెలుస్తుంది.

తమకు నచ్చినట్టు బతకడం చాల సహజంగా చేసే పని.

ఆ తెగువ చూపే ధైర్యం సమాజం చూడ నిరాకరించే వారికి మాత్రమే సాధ్యం.

ఈ విషయం ఈ నవల లో చూస్తాము. అందుకోసమే ఈ నవల వాస్తవికతకు దగ్గరగా ఉంది.

reyalisam శిల్పాన్ని కృష్ణముర్తి గారు బాగా వాడుకున్నారు.

వొక మంచి నవల చదివిన సంతృప్తి కలుగుతుంది చదివాక. 

7, జనవరి 2014, మంగళవారం

యువతకు మేలు చేసే రచన

మన సమాజం లో సానుకూల దృక్పధం గురించి చెప్పడం అంత సులువు కాదు.

మరీ ముఖ్యంగా సాహిత్యం లో పాజిటివ్ విషయాల గురించి చెప్పడం చాల మందికి నచ్చదు.

నెగటివ్ గా చెబితే వినే లక్షణం ఉన్నది.

కాని నేగటివిజం ప్రతి సారి కరెక్ట్ కాదు.

దీనికి సంబంధించి జలంధర నవల పున్నాగ పూలు లో చాల చర్చించారు.

ఆలోచించడం ఎలానో తెలియాలి.  అందుకే సరిగ్గా ఆలోచించడం నేర్పాలని జలంధర గారు అన్నారు.

మరల ఆ నవల కొన్ని పేజెస్ చదివా.

చాల మంది రచనల్లో నెగటివ్ షేడ్స్ ఎక్కువ.

ఇతరులను తిట్టడం వల్ల ఫాయిదా లేదు.

మరల మరల చదివించే మంచి నవల పున్నాగ పూలు.

చదివిన ప్రతిసారి వొక మేల్కొలుపు లా ఉంది. నిజంగానే యువతకు మేలు చేసే రచన ఇది.

యాంగ్ మో రాసిన ఉద‌య‌గీతిక నాకు అత్యంత ఇష్ట‌మైన న‌వ‌ల‌. క్యాంప‌స్‌లో ఏ హాస్ట‌ల్‌లో ఉండ‌గా దొరికిన న‌వ‌ల ఇది. న‌వ‌ల చేతికొచ్చి చ‌ద‌వ‌డం మొద‌ల...